భాగ్యలక్ష్మి ఆలయం నుంచి గో మహాయాత్ర

ABN , First Publish Date - 2021-01-23T21:04:40+05:30 IST

ఈ నెల 24న ఉదయం 9 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు.

భాగ్యలక్ష్మి ఆలయం నుంచి గో మహాయాత్ర

హైదరాబాద్: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘గో మహాయాత్ర’ను విజయవంతం చేయాలని గో రక్షకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న ఉదయం 9 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. బహదూర్‌పురాలోని మల్లన్న స్వామి ఆలయం వరకు యాత్ర జరగనుందని తెలిపారు. ఈ యాత్రలో అందరూ పాల్గొనాలని నగర ప్రజలకు గోరక్షకులు కోరారు. 


Updated Date - 2021-01-23T21:04:40+05:30 IST