కేంద్రం హెచ్చరిక.. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? అయితే..

ABN , First Publish Date - 2021-08-12T02:21:51+05:30 IST

బ్యాంకింగ్ వినియోగదారుల అకౌంట్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు కొత్తగా ఫిషింగ్ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్‌టీ-ఐఎన్) తాజాగా హెచ్చరించింది.

కేంద్రం హెచ్చరిక.. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? అయితే..

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకింగ్ వినియోగదారుల అకౌంట్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు కొత్తగా ఫిషింగ్ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్‌టీ-ఐఎన్) తాజాగా హెచ్చరించింది. ఎన్‌జీఆర్ఓకే ప్లాట్‌ఫాంను దుర్వినియోగ పరుస్తూ ఆ దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్లాట్‌ఫాం సాయంతో సైబర్ నేరగాళ్లు భారతీయ బ్యాంకుల వెబ్‌సైట్లను పోలిన నకిలీలను సృష్టించి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తారని హెచ్చరించింది. ఈ విధానంలో వినియోగదారులకు నేరగాళ్లు ఓ ఎస్ఎమ్ఎస్ పంపిస్తారట. ‘‘ఫిషింగ్ లింకులు ఉన్న ఎస్ఎమ్‌ఎస్‌లు యూజర్లకు వస్తాయి. ఈ లింకు చివర ngrok.io/xxxbank అని ఉంటుంది. ఈ లింకులపై క్లిక్ చేస్తే హ్యాక్లర్ల చేతికి వినియోగదారుల అకౌంట్ వివరాలు చిక్కుతాయి’’ అని కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-08-12T02:21:51+05:30 IST