కొవిడ్ అనాథ బాలలకు ప్రభుత్వం అండ
ABN , First Publish Date - 2021-07-31T05:13:38+05:30 IST
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మృతిచెంది అనాథలుగా మిగిలిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. జిల్లాలో కరోనాతో
కలెక్టర్ విజయరామరాజు
కడప(కలెక్టరేట్), జూలై 30: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మృతిచెంది అనాథలుగా మిగిలిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన మూడు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అంద జేసిన ఆర్థిక సాయానికి సంబందించి ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లను కలెక్టర్ అందశారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబరులో జరిగిన ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు మణి(14) వెంకటశ్రీనాథ్(16)లకు, ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన షేక్ సయ్యిద్, మహబూబీల కుమార్తె షేక్ కమాల్బీ(16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమాల కుమార్తె గొల్లపల్లి భవానీ(17)లకు బాండ్లను అందజేశారు. అనంతరం ‘బాలల - మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కలసి నడుద్దాం’ అనే నినాదంతో ఆర్తి ఫర్ గర్ల్స్, విజయ ఫౌండేషన ట్రస్టు వారు ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పద్మజ, ఎల్డీఎం దుర్గా ప్రసాద్, ఏపీడీ నిర్మల, జిల్లా బాలల సంరక్షణ అధికారి బీఆర్ సుభా్షయాదవ్, ప్రొటెక్షన అధికారి కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.