విద్యార్థినులపై లైంగిక వేధింపులు...ప్రభుత్వ పాఠశాల teacher అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-25T17:34:46+05:30 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని

విద్యార్థినులపై లైంగిక వేధింపులు...ప్రభుత్వ పాఠశాల teacher అరెస్ట్

రామనాథపురం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో జరిగింది. రామనాథపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 9,10 తరగతులకు చెందిన 15 మంది బాలికలను  గణితం, సాంఘీకశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లైంగికంగా వేధించారు.ఇద్దరు ఉపాధ్యాయులు డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతోపాటు తమను అనుచితంగా తాకారని, పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా తమకు కాల్ చేశారని విద్యార్థినులు ఆరోపించారు.శిశుసంక్షేమ శాఖ పాఠశాలలో బాలల సంరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంతో బాలికలు తమకు ఎదురైన లైంగిక వేధింపులను వెల్లడించారు.




బాలికల ఫిర్యాదు మేర పోలీసులు సోషల్ సైన్స్ టీచరును అరెస్టు చేశారు. రెండో నిందితుడైన గణితం టీచరు కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి, మహిళా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-25T17:34:46+05:30 IST