ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T04:33:51+05:30 IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
చెక్కులను పంపిణీ చేస్తున్న దృశ్యం

భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య

భద్రాచలం, డిసెంబరు 5: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కింద మంజూరైన రూ.53.08 లక్షల విలువైన చెక్కులను 55 మంది లబ్ధిదారులకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నా రు. తన క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధిదారులకు రూ.2.48 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బైరెడ్డి సీతారామారావు, నక్కా ప్రసాద్‌, సరెళ్ల నరేష్‌, బలుసు సతీష్‌, సత్యలింగం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:33:51+05:30 IST