స్విస్‌బ్యాంకులో పెరుగుతున్న భారతీయుల నిధులు.. నల్లధనం వివరాలు లేవన్న భారత్!

ABN , First Publish Date - 2021-06-20T05:57:33+05:30 IST

స్విస్‌బ్యాంకులో ఇటీవలి కాలంలో భారతీయుల నిధులు బాగా పెరిగాయట. గతేడాది అంటే 2020లో స్విస్‌బ్యాంకులో భారతీయుల నిధులు 20,700 కోట్ల రూపాయలకు పెరిగినట్లు సమాచారం.

స్విస్‌బ్యాంకులో పెరుగుతున్న భారతీయుల నిధులు.. నల్లధనం వివరాలు లేవన్న భారత్!

న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకులో ఇటీవలి కాలంలో భారతీయుల నిధులు బాగా పెరిగాయట. గతేడాది అంటే 2020లో స్విస్‌బ్యాంకులో భారతీయుల నిధులు 20,700 కోట్ల రూపాయలకు పెరిగినట్లు సమాచారం. ఈ వార్తలపై స్పందించిన భారత ప్రభుత్వం.. ఈ లెక్కల్లో నల్లధనం ఎంత ఉందనే లెక్కలు ఎక్కడా లేవని తెలిపింది. గడిచిన 13 సంవత్సరాల్లో స్విస్‌బ్యాంకులో భారతీయుల నిధులు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో వీటిలో అధికశాతం నల్లధనం నిధులేనంటూ వార్తలు వచ్చాయి. అయితే స్విస్‌బ్యాంకులో పెరిగిన నిధులు నల్లధనం లెక్కలను చూపడం లేదని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అలాగే ఇటీవలి కాలంలో స్విస్‌బ్యాంకులో భారతీయుల నిధులు పెరగడానికి లేదా తగ్గిపోవడానికి కారణాలు తెలపాల్సిందిగా స్విస్ అధికారులను ప్రభుత్వం కోరిందట.

Updated Date - 2021-06-20T05:57:33+05:30 IST