రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులు బాటు
ABN , First Publish Date - 2021-04-16T21:48:59+05:30 IST
రంజాన్ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు తాము పనిచేసే కార్యాలయాల నుంచి గంట ముందే వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రంజాన్ మాసం ప్రారంభమైన నేపధ్యంలో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు తాము పనిచేసే కార్యాలయాల నుంచి గంట ముందే వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, బోర్డులు, పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ఈనెల 14వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకూ సాయంత్రం 4గంటలకే ఇళ్లకు వెళ్లడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ దీక్షలో ఉన్నవారు సాయంత్రం సమయంలో ప్రార్ధనలు చేసుకునేందుకు, రోజా పాటించేందుకు ప్రభత్వం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించింది.