తెప్పపై గోవిందుడి రాజసం

ABN , First Publish Date - 2021-02-25T07:40:07+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా.. ఐదో రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు పుష్కరిణిలో విహరించారు.

తెప్పపై గోవిందుడి రాజసం
పుష్కరిణిలో విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి

తిరుపతి (కల్చరల్‌), ఫిబ్రవరి 24: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా.. ఐదో రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు పుష్కరిణిలో విహరించారు. ఉదయం పది నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం ఉత్సవర్లను పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం తెప్పపై అధిష్ఠింపజేసి, వేదమంత్రాలు, గోవిందనామ స్మరణల నడుమ పుష్కరిణిలో ఏడు పర్యాయాలు విహరింపజేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T07:40:07+05:30 IST