కనువిందుగా గోవిందరాజస్వామి తెప్పోత్సవం
ABN , First Publish Date - 2021-02-26T07:35:45+05:30 IST
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి.
తిరుపతి(కల్చరల్), ఫిబ్రవరి 25: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. ఆరో రోజైన గురువారం సాయంత్రం పుష్కరిణిలోని తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామిని అధిష్ఠింపజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఏడు పర్యాయాలు విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటాద్రి, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కామరాజు, మునీంద్రబాబు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.