నల్గొండ: అంబులెన్స్లను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
ABN , First Publish Date - 2021-10-07T20:20:59+05:30 IST
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.
నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనం రెండో అంతస్తులో సెమినార్ హాల్, అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎవరికన్నా సహాయం కావాలంటే రెడ్ క్రాస్కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సహాయం అందిస్తారన్నారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ ఎంతో సేవ చేసిందని కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి, స్వంత ప్రాంతానికి రెడ్ క్రాస్ ఎంతో సేవ చేస్తోందన్నారు. కోవిడ్ కాలంలో లక్ష మాస్కులను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారని, నీరు, పండ్లు, ఇతర వస్తువులను పంపిణీ చేశారన్నారు. రెడ్ క్రాస్లో యూత్, చిల్డ్రన్ మెంబర్ షిప్ భాగస్వామ్యం పెరుగుతోందని, ప్రజలకు రెడ్ క్రాస్ ఎంతో సేవ చేస్తోందని తమిళిసై ప్రశంసించారు.