15వ తేదీన గవర్నర్ ను కలవనున్న ఆస్ర్టేలియా డెలిగేషన్
ABN , First Publish Date - 2022-03-15T00:34:04+05:30 IST
ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డెలిగేషన్ ఈనెల 15వ తేదీన హైదరాబాద్ రానుంది.వారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ కానున్నట్టురాజ్ భవన్ వర్గాలు ఒకప్రకటనలో వెల్లడించాయి.
హైదనాబాద్: ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డెలిగేషన్ ఈనెల 15వ తేదీన హైదరాబాద్ రానుంది.వారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ కానున్నట్టురాజ్ భవన్ వర్గాలు ఒకప్రకటనలో వెల్లడించాయి.గవర్నర్ ను కలవనున్న టీమ్ లో ఆస్ట్రేలియా పార్లమెంట్ నేషనల్ కౌన్సిల్(దిగువసభ) ప్రెసిడెంట్ వోఫ్ గాంగ్ సొబొట్కా, ఫెడరల్ కౌన్సిల్ (ఎగువసభ) ప్రెసిడెంట్ క్రిస్టన్ స్వార్జ్ ఫక్స్ ఉన్నారు. అలాగే వారి వెంట ఆస్ర్టేలియా పార్లమెంట్ సభ్యులు, ఆస్ట్రికా కథారినా వీసర్ తదితరులతో కూడిన 19 మంది ప్రతినిధులు గవర్నర్ ను కలవనున్నారు. పలుకీలక అంశాలపై గవర్నర్ వారితో చర్చించనున్నారు.