ఇన్ఫినిటీ రైడ్..2021 ప్రారంభించిన గవర్నర్

ABN , First Publish Date - 2021-12-23T00:24:25+05:30 IST

ఆదిత్యా మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్ఫినిటీ రైడ్..2021ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

ఇన్ఫినిటీ రైడ్..2021 ప్రారంభించిన గవర్నర్

హైదరాబాద్: ఆదిత్యా మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్ఫినిటీ రైడ్..2021ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆదిత్యా మెహతాఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల్లో ప్రావీణ్యం వున్న దివ్యాంగులను పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు ట్రెయినింగ్ ఇవ్వడం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. 


అలాగే ఈ రైడ్ ద్వరా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. ది ఇన్పినిటీ రైడ్,2021ను హైదరాబాద్ నుంచి కర్నాటకలోని గోకర్ణ వరకు 660 కి.మీ. వరకూ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐటిబిపి, ఎన్ సిబి, తెలంగాణ, కర్నాటక పోలీసులు మద్దతునిస్తున్నారు.

Updated Date - 2021-12-23T00:24:25+05:30 IST