స్పీకర్ పోచారం త్వరగా కోలు కోవాలి: గవర్నర్
ABN , First Publish Date - 2021-11-26T01:27:46+05:30 IST
తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరంగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రార్ధించారు.
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరంగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రార్ధించారు. స్పీకర్ పోచారం కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. స్పీకర్ పోచారం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.