సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళి సై

ABN , First Publish Date - 2022-04-11T16:58:30+05:30 IST

శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని గవర్నర్ తమిళి సై అన్నారు.

సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళి సై

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమిళి సై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. 

Updated Date - 2022-04-11T16:58:30+05:30 IST