సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2022-03-12T19:24:38+05:30 IST

స్వల్ప అనారోగ్యానికి గురైన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పుష్ప గుచ్చం పంపించారు.

సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: స్వల్ప అనారోగ్యానికి గురైన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పుష్ప గుచ్చం పంపించారు. ‘‘సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యాను’’ అని పుష్పగుచ్చంతో పాటు పంపిన లేఖలో గవర్నర్ తమిళిసై తెలిపారు. కాగా... నిన్న అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లి పలు వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన గవర్నర్ ఈరోజు పై విధంగా స్పందించారు. 

Updated Date - 2022-03-12T19:24:38+05:30 IST