కొండరెడ్లను కలవడం ఆనందంగా ఉంది: గవర్నర్ తమిళి సై

ABN , First Publish Date - 2022-04-12T19:59:22+05:30 IST

కొండరెడ్లను వాళ్ల గ్రామంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు.

కొండరెడ్లను  కలవడం ఆనందంగా ఉంది:  గవర్నర్ తమిళి సై

భద్రాద్రి కొత్తగూడెం: కొండరెడ్లను వాళ్ల గ్రామంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెంలో  గవర్నర్ పర్యటించారు.  ఆదివాసీలతో కలసి  గవర్నర్ తమిళి సై భోజనం చేశారు. ఈ సందర్బంగా గవర్నర్  మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. గిరిజన ఆహారంలో పోషకాహార లోపాలు ఉన్నాయి.ఆదిమ గిరిజన తెగలల్లో పౌష్టికాహారం లోప నివారణ మరియు సమగ్ర అభివృద్ధి పథకం ఏర్పాటు చేశాం. ఈ ఫైలట్ ప్రాజెక్ట్ మరింత ముందుకు సాగాలి. దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలం లోని గోగులాపూడి గ్రామాలను దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, వారి జీవనాలు ఇంకా ఎదగాలి. అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది’’ అని గవర్నర్ తమిళి సై తెలిపారు.   

Updated Date - 2022-04-12T19:59:22+05:30 IST