రాజ్భవన్లో ఆయుధ పూజ నిర్వహించిన గవర్నర్
ABN , First Publish Date - 2021-10-14T21:46:23+05:30 IST
మహర్నవమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ గురువారం రాజ్భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు.
హైదరాబాద్: మహర్నవమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ గురువారం రాజ్భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు, వాహనాలకు గవర్నర్ పూజ చేశారు. ఇక రాజ్భవన్లోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గవర్నర్తో పాటు ఆమె భర్త సౌందరరాజన్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రాజ్భవన్లోని సుధర్మ బ్లాక్లో ఉన్న లైబ్రరీని సందర్శించిన గవర్నర్ అక్కడ పుస్తక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లైబ్రరీ అంతాకలియ తిరిగి కొన్ని పుస్తకాలను తీసుకున్నారు. పుస్తకాలు చదడం తనకు ఎంతోఇష్టమని ఆమె పేర్కొనారు.దసరా పండగ సందర్భంగా గవర్నర్ తమళిసై రాజ్భవన్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.