అల్లూరి స్వస్థలంలో హర్యానా గవర్నర్
ABN , First Publish Date - 2022-01-09T01:54:13+05:30 IST
జిల్లాలోని పాలకొడేరు మండలంలోని మోగల్లులో
పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొడేరు మండలంలోని మోగల్లులో అల్లూరి సీతారామరాజు స్వస్థలాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. సీతారామరాజు ఇంటి ఆవరణలో మొక్కలను దత్తాత్రేయ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ వీరులను స్మరించుకోవాలన్నారు. మహనీయులను అందరమూ గౌరవించాలన్నారు. గిరిజనులను సంఘటితం చేసి బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప మహనీయుడు అల్లూరి అని ఆయన కొనియాడారు.