మొక్కనాటిన మోదీ...రాజ్ భవన్ ఆతిధ్యానికి ఫిదా
ABN , First Publish Date - 2022-07-04T20:48:40+05:30 IST
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీ ఆదివారం సాయంత్రం బహిరంగ సభ అనంతరం రాజ్ భవన్ లో విడిది చేశారు.
హైదరాబాద్: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీ ఆదివారం సాయంత్రం బహిరంగ సభ అనంతరం రాజ్ భవన్ లో విడిది చేశారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై, రాజ్ భవన్ సిబ్బంది ఇచ్చిన ఆతిధ్యానికి మోదీ ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా ఆయన గవర్నర్ తో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రాజభవన్ ఆవరణలో మోదీ కదంబ మొక్కను నాటారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ, సంస్క`తికి ప్రతీక అయిన బతుకమ్మ, బోనాలనుకూడా రాజ్ భవన్ లో ప్రదర్శించారు. ఈపండగల ప్రత్యేకతల గురించి కూడా గవర్నర్ మోదీకి వివరించారు.