యూనివర్శిటీ సిబ్బందితో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-05-29T23:13:09+05:30 IST
రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్స్టాఫ్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్స్టాఫ్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. అందులో భాగంఆనే శుక్రవారం వరంగల్ కాకతీయ యూనివర్శిటీతో పాటు దాని అనుబంధ కాలేజీల టీచింగ్స్టాఫ్తో మాట్లాడారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల స్టాఫ్తో రోజు విడిచి రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెఇపారు. ఈసందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ అధికారులతో రెండు వారాల పాటు ఇంటరాక్ట్ కాబోతున్నట్టు తెలిపారు. తద్వారా యూనివర్శిటీల పనితీరు, విద్యాసంబంధ అంశాలపై వారితో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు.