నేడు నగరానికి గవర్నర్‌ రాక

ABN , First Publish Date - 2022-10-03T06:17:44+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం నగరానికి రానున్నారు.

నేడు నగరానికి గవర్నర్‌ రాక

విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):


రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం నగరానికి రానున్నారు.  మధ్యాహ్నం 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 4.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రుషికొండ బేపార్కులోని పేమా వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళతారు. తిరిగి రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 7.50 గంటలకు గన్నవరం వెళతారని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-10-03T06:17:44+05:30 IST