రైల్ నిలయం ముందు ప్రభుత్వ విప్ బైఠాయింపు

ABN , First Publish Date - 2022-01-31T21:45:06+05:30 IST

నగరంలోని దక్షిణ మధ్య రైల్యే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం

రైల్ నిలయం ముందు ప్రభుత్వ విప్ బైఠాయింపు

సికింద్రాబాద్: నగరంలోని దక్షిణ మధ్య రైల్యే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ముందు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బైఠాయించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా  వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట వ్యాగన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఖబడ్దార్ బీజేపీ నేతల్లారా, తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించాలన్నారు. 

Updated Date - 2022-01-31T21:45:06+05:30 IST