అమరావతి: విశాఖ ఉక్కును అమ్మేస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఎమ్మల్యే గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాక్రాంతం చేస్తున్నాయని విమర్శించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ను ప్రైవేట్పరం చేసినా చలనం లేదన్నారు. ఈ ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలా పోరాటం చేస్తామని గద్దె రామ్మోహన్ హెచ్చరించారు.