డ్రోన్లతో ఈ ప్రాంతాల్లో ద్రావణం స్ప్రే.. ప్రభుత్వం తాజా నిర్ణయం!
ABN , First Publish Date - 2020-04-10T23:52:15+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన హాట్స్పాట్ల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.
నోయిడా: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన హాట్స్పాట్ల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఉత్తరప్రదేశ్లో కరోనా హాట్స్పాట్లుగా మారిన ప్రాంతాలను పూర్తిగా సీల్ చేశారు. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు. ఈ హాట్స్పాట్లలో కొన్నింటిని ఎంపిక చేసి, అక్కడ డ్రోన్ల సాయంతో డిసిన్ఫెక్టెంట్లు స్ప్రే చేయాలని నోయిడా ప్రభుత్వాధికారులు నిర్ణయించారు. ఈ డ్రోన్లతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఆయా ప్రాంతాల్లో చల్లుతారు. అలాగే ఈ ప్రాంతాల్లో కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్న అధికారుల కోసం ప్రత్యేకంగా డిసిన్ఫెక్టెంట్లు చల్లే రెండు టన్నెల్లు ఏర్పాటు చేశారు. ఈ డిసిన్ఫెక్టెంట్ల నుంచి నడిచిన వారి శరీరంపై ఉండే సూక్ష్మజీవులు 30 సెకన్లలో మరణిస్తాయని అధికారులు తెలిపారు.