క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘిస్తే.. హత్యాయత్నం కేసు: ఆరోగ్య మంత్రి
ABN , First Publish Date - 2020-06-06T03:20:51+05:30 IST
క్వారంటైన్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై అస్సాం ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
దిస్పూర్: క్వారంటైన్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై అస్సాం ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇలా నిబంధనలు ఉల్లంఘించి, ఇతరులకు కరోనా సోకేలా చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అవవసరమైతే వీరిపై హత్యాయత్నం కేసులు బుక్ చేస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులుంటే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. తద్వారా ఆ సమస్యకు పరిష్కారం పొందాలని, అంతేగానీ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.