ప్రగతి భవన్ ముట్టడికి ప్రభుత్వ టీచర్ల యత్నం..

ABN , First Publish Date - 2022-01-12T19:31:44+05:30 IST

హైదరాబాద్: 317 జీవోకు సంబంధించి రగడ కొనసాగుతోంది.

ప్రగతి భవన్ ముట్టడికి ప్రభుత్వ టీచర్ల యత్నం..

హైదరాబాద్: 317 జీవోకు సంబంధించి రగడ కొనసాగుతోంది. ఆ జీవోను నిలిపివేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రభుత్వ ఉపాధ్యాయులు యత్నించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని పలువురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-12T19:31:44+05:30 IST