ధాన్యం కొనకుండా ప్రభుత్వం డ్రామాలాడుతోంది: శ్రీధర్బాబు
ABN , First Publish Date - 2021-11-28T21:38:56+05:30 IST
ధర్నాచౌక్ను ఎత్తేసిన సీఎం కేసీఆర్ అక్కడే ధర్నా చేశారని ఎమ్మెల్యే శ్రీధర్బాబు విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
హైదరాబాద్: ధర్నాచౌక్ను ఎత్తేసిన సీఎం కేసీఆర్ అక్కడే ధర్నా చేశారని ఎమ్మెల్యే శ్రీధర్బాబు విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి దీక్షలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనకుండా ప్రభుత్వం డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ప్రతిగింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని శ్రీధర్బాబు ప్రకటించారు.