ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి

ABN , First Publish Date - 2020-05-25T10:17:45+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని కావలి ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి

కావలి, మే24: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కావలిలోని వైసీపీ కార్యాలయంలో ఆపార్టీ నాయకులతో ఆ తర్వాత మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో ఆదివారం ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.


ఈ నెల 31 లోపు అర్హులైన వారి నుంచి నివేశన స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లకోసం దరఖాస్తులు స్వీకరించే బాధ్యతను అధికారులతో పాటు వైసీపీ నాయకులు కూడా తీసుకోవలన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గ్రంధం ప్రసన్నాంజనేయులు, కమిషనర్‌ శివారెడ్డి, డీఈ శ్రీనివాసరావు, ఆర్వో శేఖర్‌, టీపీవో దశయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T10:17:45+05:30 IST