ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2020-12-05T05:10:04+05:30 IST
ప్రభుత్వ పథకాలను స ద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకటసుబ్బయ్య అన్నారు.
ఎస్పీ కార్పొరేషన్ ఈడీ
గోపవరం, డిసెంబరు 4 : ప్రభుత్వ పథకాలను స ద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకటసుబ్బయ్య అన్నారు. శుక్రవారం మండలం లో రేషన్ షాపులకు సరుకులు చేరవేసే మినీ ట్రక్కులకు డ్రైవర్ల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఆర్థిక చేయూతనిచ్చేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు.ప్రభుత్వ పథకాలకు నిర్వహించే ఇంటర్వ్యూల్లో పారదర్శకంగా ఉండాలని సూచించారు. మినీ ట్రక్కుల కోసం 46 మంది డ్రైవర్లు దరఖాస్తు చే సుకున్నారని, వారిలో అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపీడీఓ భానుప్రసాద్, ఈఓపీఆర్డీ విజయకుమార్, బ్యాంకు మేనేజర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.