ప్రభుత్వ కార్యాలయాలు కళకళ

ABN , First Publish Date - 2020-05-23T10:27:03+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలు రెండ్రోజులుగా కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 103 ప్రభుత్వ కార్యాలయాలుంటే..

ప్రభుత్వ కార్యాలయాలు కళకళ

చిత్తూరు కలెక్టరేట్‌, మే 22: ప్రభుత్వ కార్యాలయాలు రెండ్రోజులుగా కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 103 ప్రభుత్వ కార్యాలయాలుంటే.. సుమారు 43వేలమంది సిబ్బంది వీటిల్లో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా  33 శాతం సిబ్బందితో కొన్ని కార్యాలయాలు, సిబ్బందే లేకుండా కొన్ని పనిచేశాయి. గురువారం నుంచి 85 శాతం మంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా.. జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలని కార్యాలయం వెలుపల బోర్డు పెట్టారు. 

Updated Date - 2020-05-23T10:27:03+05:30 IST