ఓటీటీ రంగంలోకి కేరళ ప్రభుత్వం!
ABN , First Publish Date - 2022-05-19T08:28:01+05:30 IST
ఓటీటీ(ఓవర్ ది టాప్) రంగంలోకి ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వమే దిగుతోంది. సీస్పేస్ పేరుతో ఓటీటీ సంస్థను ప్రారంభించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తిరువనంతపురం, మే 18: ఓటీటీ(ఓవర్ ది టాప్) రంగంలోకి ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వమే దిగుతోంది. సీస్పేస్ పేరుతో ఓటీటీ సంస్థను ప్రారంభించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు 1న దీన్ని అధికారికంగా మొదలెడతామని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్ వెల్లడించారు. ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీ్సలు, ఇతరత్రా వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు.