జీపీ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం: సీఐటీయూ

ABN , First Publish Date - 2022-05-17T06:21:35+05:30 IST

ఫ్రీజింగ్‌ సాకుతో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జీపీ కార్మికుల వర్కర్స్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు పల్లె గణపతిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు ఆవేదన వ్యక్తం చేశారు.

జీపీ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం: సీఐటీయూ
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు

భువనగిరి రూరల్‌, మే 16: ఫ్రీజింగ్‌ సాకుతో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జీపీ కార్మికుల వర్కర్స్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు పల్లె గణపతిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీజింగ్‌ పేరుతో పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్నారు.  అనంతరం కలెక్టర్‌ పమేలా సత్పథికి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన నాయకులు మాయ కృష్ణ, సలీం, గడ్డం ఈశ్వర్‌, ఎల్లయ్య, రాము, యాదగిరి, బాబు, నరేశ, శ్రీశైలం, యాదమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:21:35+05:30 IST