భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-20T05:05:41+05:30 IST
భవన నిర్మాణ కార్మికులపై ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్బాషా తెలిపారు.
కొండాపురం, అక్టోబరు 19: భవన నిర్మాణ కార్మికులపై ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్బాషా తెలిపారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. సంక్షేమ నిధు లు కార్మికులకు ఉపయోగపడకుండా ఇతర పథకాలకు మళ్లించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఇసుక కొరతతో ఉపాధి కరువై కుటుంబ పోషణ దుర్భరంగా మారిందని, కార్మికులను చైతన్యం చేసేందుకు ఈనెల 24,25 తేదీలలో మైదుకూరులో శి క్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి మనోహర్బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.