రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పని చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T10:40:55+05:30 IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రాజాంగ వ్యవస్థలకు లోబడి పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పని చేయాలి

 బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం


గుజరాతీపేట: హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం  ఇకనైనా రాజాంగ వ్యవస్థలకు లోబడి పని చేయాలని  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం హితవుపలికారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్ర  ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం తొల గించడాన్ని హైకోర్పు తప్పుపట్టిందని, కొత్త కమిషనర్‌ను నియమించడాన్ని ఆర్టికల్‌ 213 ప్రకారం చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.


ప్రభుత్వం తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాలపై కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మకం, గ్రామ సచివాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం వంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పుపట్టిందన్నారు.  సమావేశంలో బీజేపీ నాయకులు దయాసాగర్‌, జామి ప్రసాద్‌, పాండురంగారావు, పర్ల రామారావులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T10:40:55+05:30 IST