ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-08-11T05:54:21+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
పరమపద వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, ఆగస్టు 10 : ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో మల్లారెడ్డి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పరమపద వాహనాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మట్లాడుతూ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పరమపద వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:54:21+05:30 IST