గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ABN , First Publish Date - 2022-05-28T05:27:55+05:30 IST
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
చేవెళ్ల, మే 27: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని శంకర్పల్లి ఎంపీపీ గోవర్థన్రెడ్డి అన్నారు. శుక్రవారం మహరాజ్పేట్లో మన ఊరు-మన బడి కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మల్లమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.