ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించింది: కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-03-17T21:57:43+05:30 IST

ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం

ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించింది: కేటీఆర్‌

హైదరాబాద్: ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం రూ.2వేలకు పెంచిందన్నారు. రాష్ట్రంలో 4.20 లక్షల మంది బీడీ కార్మికులకు ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. లక్ష మందికి పైగా మహిళలకు రూ.2,016 పింఛన్‌ ఇస్తామని, అలాగే దివ్యాంగులకు రూ.3,016 పింఛన్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశామని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-03-17T21:57:43+05:30 IST