‘ట్రంప్‌ మోజులో పడితే.. సిరియాలా తయారవుతాం..’

ABN , First Publish Date - 2020-02-25T21:19:09+05:30 IST

‘ట్రంప్‌ మోజులో పడితే.. సిరియాలా తయారవుతాం..’

‘ట్రంప్‌ మోజులో పడితే.. సిరియాలా తయారవుతాం..’

ముంబై: భారత ప్రభుత్వం ట్రంప్‌ మోజులో పడి, దేశంలో సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ చాండెల్ విమర్శించారు.  ట్విట్టర్ వేదికగా ఆమె దీనిపై వరుస ట్వీట్లు చేశారు. ‘భారత ప్రభుత్వం ట్రంప్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో బిజీ అయిపోయింది. ఏమీ చేయకుండా ఇలానే వదిలేస్తే భారత్‌ కూడా సిరియాలా మారిపోతుంది’ అని ఆమె ట్వీట్ చేసింది. ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ట్విట్టర్ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. మరో ట్వీట్‌లో ‘దేశానికి గుండెలాంటి ఢిల్లీలో.. మినీ పాకిస్తాన్‌ కాదు.. మినీ సిరియా తయారైంది’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంలో బీజేపీ నేతలు ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘దేశ రాజధానిలో మినీ పాకిస్తాన్ సృష్టించారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-02-25T21:19:09+05:30 IST