విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

ABN , First Publish Date - 2021-05-17T05:35:12+05:30 IST

పరీక్షల పేరుతో ముఖ్యమంత్రి జగన విద్యార్థుల జీవితా లతో చెలగాటమాడుతున్నాడని టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ విమర్శించారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

-టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ

ధర్మవరంఅర్బన, మే 16: పరీక్షల పేరుతో ముఖ్యమంత్రి జగన విద్యార్థుల జీవితా లతో చెలగాటమాడుతున్నాడని టీఎనఎస్‌ఎఫ్‌ హిందూపురం  పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ విమర్శించారు. ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడా రు. పది, ఇంటర్‌ పరీక్షలను రద్దుచే యాలని నారాలోకేశ లేఖ రాస్తే  దానిని ఏ మా త్రం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహి స్తామని చెప్పడం మూర్ఖత్వమన్నా రు. రాష్ట్రంలో ఇప్ప టికే లక్ష కరోనా కేసులు, 7500 మంది కరోనా వైరస్‌బారినపడి మర ణించారన్నారు. రోజుకు 10వేల కేసులు నమో దవుతు న్నాయన్నారు. ఆస్పత్రిల లో బెడ్లు, ఆక్సిజన, మందులు దొరకక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులుప డుతున్నారన్నారు. చివరికి శ్మశాన వాటికలో దహన సం స్కారాలకు కూడా స్థలంలేని పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. వ్యాక్సిన ఇచ్చిన తరువాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో రెండు రోజులుగా 29మంది విద్యార్థులు, 150మంది ఉపాధ్యాయులు చనిపోయారన్నారు. ఇప్పటికైనా పంతం వీడి పది, ఇంటర్‌ పరీక్షలను  వ్యాక్సిన ఇచ్చిన తరువాతే జరపాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-17T05:35:12+05:30 IST