హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి: జేడీ శీలం
ABN , First Publish Date - 2022-03-05T02:12:11+05:30 IST
అమరావతి రాజధానిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు.
గుంటూరు: అమరావతి రాజధానిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియా మాట్లాడారు. అవినీతిలో టీడీపీ కిటికీలు తెరిస్తే, వైసీపీ నేతలు తలుపులు తెరుస్తున్నారని ధ్వజమెత్తారు. వలంటీర్లు ప్రభుత్వానికి వారధిగా మాత్రమే పనిచేయాలి కానీ పొలిటికల్ పార్టీలకు ఏజంటుగా పనిచేస్తే పుట్టగతులుండని హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే పథకాలు కట్ చేస్తామంటూ వలంటీర్లు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కేంద్రాన్ని ఎదిరించగలిగే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉందన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందని జేడీ శీలం తెలిపారు.