ఇది కోతల ప్రభుత్వం: హరిరామ జోగయ్య
ABN , First Publish Date - 2022-03-19T00:59:30+05:30 IST
తన 60 ఏళ్ళ ప్రస్తానంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలనను ఎప్పడూ చూడలేదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య త్రీవ ఆరోపణలు చేశారు.
పాలకొల్లు: తన 60 ఏళ్ళ ప్రస్తానంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలనను ఎప్పడూ చూడలేదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య త్రీవ ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆక్సిజన్ను, నిబిలైజర్ సహాయంతో చికిత్స పొందుతున్నానని, వేళా పాళా లేని విద్యుత్ కోతలు చూస్తుంటే తన ప్రాణానికే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఇంతటి దారుణ పరిస్థితి లేదన్నారు. వేసవిలో ఎప్పుడైనా విద్యుత్ కోతలు ఉండేవని, ఇప్పుడు అనునిత్యం కోతలేనని, చివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా కోతల ప్రభుత్వంగానే మిగిలిందని జోగయ్య విమర్శించారు.