నిరుపేదలకు సర్కారు అండ
ABN , First Publish Date - 2022-08-12T06:03:34+05:30 IST
సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేద ల కు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జగిత్యాలరూరల్, ఆగస్టు 11 : సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేద ల కు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి గ్రామానికి చెందిన చిర్ర రాజుకు దళితబంధు ద్వారా మంజూరైన మొబైల్ టిఫిన్ సెం టర్ వాహనాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జగి త్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్దిదారు లకు లక్షా. 50 వేల విలువ గల చెక్కులను లబ్ధిదారుల ఇంటికివెళ్లి ఎ మ్మె ల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో వై ద్యానికి డబ్బులు లేక ఎంతో మంది నిరుపేదలు మరణించిన సంధర్బాలు ఉండేవని తెలిపారు. నేడు టీఆర్ఎస్ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అం దిస్తూ ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అనాధిగా వివక్షకు గురైన ఎస్సీల జీవితాల్లో వెలగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్ర వేశపెట్టి, ఒక యజ్ణం మాదిరిగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నా రు. దళితబంధు ప్రపంచానికే ఆదర్శమన్నారు. దళితులకు టీఆర్ఎస్ అండ గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ శీలం సు రేందర్, సర్పంచ్ డెక్క ప్రభాకర్, కౌన్సిలర్ షాంద్పాషా, కారోబార్ నరేష్, ఉపసర్పంచ్ మహేష్, నాయకులు రవీందర్రెడ్డి, వెంకటి, శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, నారాయణ, పాల్గొన్నారు.