రేషన్ పంపిణీలో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-03-31T09:08:03+05:30 IST
రేషన్ పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా నియంత్రణ చర్యలు మొక్కుబడిగా
పేదలకు ఇస్తున్న కరోనా ప్యాకేజీని పెంచాలి
సీఎం జగన్కు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ బహిరంగ లేఖ
గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా నియంత్రణ చర్యలు మొక్కుబడిగా చేపడుతోందని, పేదలకు ప్యాకేజీని రూ.5వేలకు పెంచాలని కోరుతూ సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. రేషన్ దుకాణాల వద్ద వందలాది మంది ఒకే చోట చేరటంతో ప్రమాదం మరింత పెరిగే అవకాశం లేదా అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. గ్రామాలలో వలస, వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అలానే రైతులు పంటలను కోల్డ్స్టోరేజీలలో పెట్టుకోవడానికి పోలీసు ఆంక్షలు అడ్డువస్తున్నాయని తెలిపారు.