‘కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం’

ABN , First Publish Date - 2021-05-09T05:36:07+05:30 IST

రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా విమర్శించారు.

‘కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం’

ఆళ్లగడ్డ, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపు మేరకు కరోనాపై నిరసన కార్యక్రమాన్ని మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని తన ఇంటిలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టామన్నారు. మొదటి విడత కరోనాలో రెండోసారి కరోనా విజృంభిస్తుందని మేధావులు, శాస్త్రవేత్తలు చేప్పిన సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా నిజాలు మాట్లాడిన చంద్రబాబునాయుడుపై కేసులు పెట్టడం దారుణ మన్నారు. టీడీపీ కార్యకర్తలు నన్నెబైగారి జైలన్‌, ఉమ్మార్‌సాబ్‌ గారి మాబువుసేన్‌, ఓబన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:36:07+05:30 IST