మేధోమథనం లాంటి సదస్సులు చాలా అవసరం: సజ్జల
ABN , First Publish Date - 2021-08-08T22:27:23+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మేధో మధన సదస్సును విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మేధో మధన సదస్సును విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేధోమథనం లాంటి సదస్సులు చాలా అవసరమని చెప్పారు. ఏపీఏస్ ఏర్పాటుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఏవిధంగా దోహద పడుతుందనే అంశాలపై చర్చించాలని, గత నాలుగు దశాబ్దాలుగా ఏపీఎస్పై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.