ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: బొత్స

ABN , First Publish Date - 2021-11-29T21:16:38+05:30 IST

ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: బొత్స

అమరావతి: ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామని, ఐఆర్ ప్రకటించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పురపాలక సంఘాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు ఆగలేదని, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన ఇస్తామన్నారు. అనవసర రాద్ధాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ నిర్వహణ ఖర్చుల చెల్లింపునకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2021-11-29T21:16:38+05:30 IST