మార్కెట్‌యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-06-26T05:56:03+05:30 IST

మార్కెట్‌యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మార్కెట్‌యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
శంకుస్థాపన చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జూన్‌ 25: వ్యవసాయ మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ మద్దెల శివలీల అధ్యక్షతన శనివారం మార్కెట్‌యార్డులో రూ.70లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.కృష్ణారెడ్డి, మండల వైఎస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, చేవెళ్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివలీల,  ఏడీఏ దివ్యజ్యోతి, గిరిధర్‌రెడ్డి, శేరి శివారెడ్డి, ప్రభాకర్‌, యాదయ్యగౌడ్‌, యాదయ్య, అబ్దుల్‌ఘనీ ఉన్నారు.

Updated Date - 2022-06-26T05:56:03+05:30 IST