గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి

ABN , First Publish Date - 2021-06-24T04:49:14+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి
కల్లేపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

 ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 


బెజ్జంకి, జూన్‌ 23: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని కల్లేపల్లి గ్రామంలో పది లక్షల  గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, సర్పంచ్‌ దారం లక్ష్మితో కలిసి బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు మోహన్‌ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సబిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌  నాయకులు శ్రీనివా్‌సగుప్తా, లక్ష్మణ్‌, తిరుపతి, శేఖర్‌బాబు, మోహన్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-24T04:49:14+05:30 IST