అన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2021-10-20T05:23:37+05:30 IST
ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దికి కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 19 : ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దికి కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తిలో మురికి కాలువకు, శ్మశాన వాటిక ప్రహరీగోడ నిర్మాణానికి అలాగే మస్కాపూర్లో మున్నూర్ కాపు సంఘ భవన నిర్మానం కోసం మంగళవారం భూమిపూజ చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది పనులకు మొదటి ప్రాధా న్యతనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాము నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు పార్శపు శ్రీనివాస్, మహేందర్, ఎంపిపి అబ్దుల్ మోహిద్, ఎంపిటీసీలు శనిగారపురాణి శ్రావణ్, పుప్పాల స్వప్న గజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, మున్సిపల్ చైర్మన్ రాజేందర్, నాయకులు ఆకుల వెంకాగౌడ్, జన్నారపు శంకర్, గాజుల గంగన్న, రాజరెడ్డి, రాజ గంగన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.