ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉంది: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2021-08-23T20:24:41+05:30 IST
ఏపీ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని, అనుమానాలకు తావులేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని, అనుమానాలకు తావులేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు. విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదని, రాజధానిపై కేసు వేసిన పిటిషనర్లు వాయిదా అడగాల్సి అవసరం ఏమొచ్చింది..? అని ప్రశ్నించారు. వాయిదా వేయాలని అడగటంలో ఏమైనా దురుద్దేశం ఉందా?.. అనేది అర్థం కావడం లేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.